నేరేడ్మెట్, మే 16: నియోజకవర్గంలో ప్రజా సమస్యలు త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తెలిపారు. సోమవారం ఆయన వినాయక్నగర్ డివిజన్ పరిధిలోని శివనగర్లో కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి, పలు శాఖల అధికారులతో కలిసి ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హన్మంతరావు మాట్లాడుతూ.. ఇంటింటికీ మైనంపల్లి పేరుతో ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్తూ సమస్యలు లేని నియోజకవర్గంగా మల్కాజ్గిరిని తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. వానకాలంలో వరద ముంపు సమస్య తలెత్తకుండా బాక్స్ డ్రైనేజీ పనులు ముమ్మరంగా చేపడుతున్నట్లు చెప్పారు. శివనగరన్, వినోభానగర్, అంబేద్కర్ నగర్ ప్రాంతాల్లో బాక్స్ డ్రైనేజీ పనులు చేయాలని స్థానికులు కోరినట్లు ఎమ్మెల్యే చెప్పారు.
విద్యుత్ స్తంభాలు, వీధి లైట్లు, తాగునీటిసమస్యలు స్థానికులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే వాటిని పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. డబుల్ ఇండ్లు, పింఛన్లు, పెండింగ్లో ఉన్న రోడ్లు, డ్రైనేజీ, కమ్యూనిటీ హాళ్లను నిర్మించాలని స్థానికులు ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డీసీ రాజు, ఈఈ లక్ష్మణ్, డీఈ మహేశ్, ఏఈ దీపక్, జలమండలి జీఎం సునీల్కుమార్, డీజీఎం భాస్కర్, ఏసీపీ గజానంద్, ఎలక్ట్రికల్ ఏడీఈ శ్రీనివాస్రెడ్డి, ఏఈ వెంకటేశ్, కార్పొరేటర్లు మీనాఉపేందర్రెడ్డి, ప్రేమ్కుమార్, జితేంద్రనాథ్, మాజీ కార్పొరేటర్ జగదీశ్ గౌడ్, పరశురాంరెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఆలయాల్లో సదుపాయాలు కల్పిస్తాం..
మల్కాజిగిరి,మే16: ఆలయాల్లో మౌలిక వసతులు కల్పిస్తామని ఎమ్మెల్యే హన్మంతరావు అన్నారు. సోమవారం మల్కాజిగిరి డివిజన్ విష్ణుపురి ఎక్స్టెన్షన్ కాలనీలోని శ్రీస్వయంభు సిద్ధివినాయక ఆలయంలో ఎమ్మెల్యే పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రేమ్కుమార్, మాజీ కార్పొరేటర్ జగదీశ్గౌడ్, జీఎన్వీ సతీష్కుమార్, సంతోష్రాందాస్ పాల్గొన్నారు.
రాజీవ్గాంధీనగర్ కాలనీ సమస్యను పరిష్కరిస్తాం
రాజీవ్గాంధీనగర్ కాలనీ సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హన్మంతరావు అన్నారు. సోమవారం మల్కాజిగిరి డివిజన్ రాజీవ్గాంధీనగర్ కాలనీ వాసులకు రైల్వే అధికారులు ఇచ్చిన నోటీసుల సమస్యపై స్థానికులతో ఎమ్మెల్యే చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నోటీసులపై రైల్వే అధికారులతో చర్చించి సమస్య పరిష్కరం కోసం కృషిచేస్తామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రేమ్కుమార్, మాజీ కార్పొరేటర్ జగదీశ్గౌడ్, జీఎన్వీ సతీశ్కుమార్, శ్రీకాంత్, సంతోశ్రాందాస్, సత్యనారాయణ, సైదులు పాల్గొన్నారు.