మూసాపేట, మే16 : లారీ అతివేగం ఒకరిని మింగేసింది. కూకట్పల్లి సీఐ నర్సింగ్రావు తెలిపిన వివరాల ప్రకారం… సంగారెడ్డి వీరభద్రానగర్కు చెందిన శివాని(21) దిల్సుఖ్నగర్లో హాస్టల్లో ఉంటూ కానిస్టేబుల్ శిక్షణ తీసుకుంటున్నది. సోమవారం తెల్లవారుజామున తన స్నేహితుడు మహేశ్ బైక్పై జేఎన్టీయూ నుంచి బాలానగర్ వైపు వెళ్తండగా కూకట్పల్లి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వద్ద వెనుక నుంచి అతివేగంగా దూసుకొచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్పై ఉన్న ఇద్దరికీ తీవ్రగాయాలు కాగా, స్థానికుల సమాచారంతో కూకట్పల్లి పోలీసులు 108అంబులెన్స్లో ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. అయితే అప్పటికే శివానీ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మహేశ్ అదే దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. మృతురాలి తల్లి శోభ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.