హిమాయత్నగర్, మే 16 : కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రోడ్డు భద్రతా చట్టాన్ని సాకుగా చూపించి ఫిట్నెస్ ధ్రువీకరణ ఆలస్యమైతే రోజుకు రూ.50 జరిమానా విధించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 19న ఒక రోజు ఆటో, క్యాబ్, లారీల బంద్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఆటో, క్యాబ్, లారీ సంఘాల జేఏసీ వెల్లడించింది. ఈ మేరకు సోమవారం హైదర్గూడలోని ఎన్ఎస్ఎస్లో బంద్కు సంబంధించిన వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం జేఏసీ రాష్ట్ర నాయకులు ఆర్.మల్లేశ్ (ఏఐటీయూసీ), వి.మారయ్య (టీఆర్ఎస్కేవీ), మహ్మద్ అమానుల్లాఖాన్(టీఏడీజేఏసీ), కిరణ్ (ఐఎఫ్టీయూ), శ్రీకాంత్ (సీఐటీయూ), ఏ.సత్తిరెడ్డి(ట్రాన్స్పోర్ట్ జేఏసీ) మాట్లాడారు. బంద్లో అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు శ్రీనివాస్, మల్లేశ్, సలావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.