వెంగళరావునగర్, మే 16: ప్రపంచంలో హిందూ సంస్కృతి ఎంతో సమున్నతమైనదని, చెక్కు చెదరకుం డా ఉన్నది కూడా హిందూ సంస్కృతి మాత్రమేనని మాజీ ఎంపీ డాక్టర్ సుబ్రహణ్యస్వామి అన్నారు. శ్రీనగర్ కాలనీలోని సత్యసాయిని గమాగమంలో సోమవారం సాయంత్రం ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ చైర్మన్ డాక్టర్ సహదేవ దాసా, బీఎస్ఎఫ్ మాజీ ఆడిషనల్ డీజీ పి.కె.మిశ్రా, నాగ్పూర్ గో సంస్థాన్ అధ్యక్షులు సునీల్ మాన్సింగ్, ముంబై గో సంరక్షణ నాయకులు కమ్లేశ్ షాదీ, క్యాన్సర్ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ వల్లభబాయి పటారియా, వీహెచ్ఎస్ జనరల్ సెక్రటరీ గోవింద్ హరీశ్, ఉపాధ్యక్షుడు జగదీశ్ శెట్టి, గో సంరక్షకులు రామ్ భోగియా పాల్గొన్నారు.