మేడ్చల్ రూరల్, మే 16: ముందు జాగ్రత్త చర్యలతో ప్రాణాంతక డెంగీని ఎదుర్కోవచ్చని కార్మిక శాఖా మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతీయ డెంగీ నివారణ దినం సందర్భంగా సోమవారం మేడ్చల్లో పెద్ద ఎత్తున అవగాహన ర్యాలీ నిర్వహించారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వద్ద మంత్రి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో వచ్చే వ్యాధి నియంత్రణకు ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. దోమలతో వచ్చే వ్యాధిని అరికట్టడానికి పరిసరాల్లో నీటి నిల్వలు ఉండకుండా చూసుకోవాలన్నారు. అలాగే, కుండలు, బిందెలు, డ్రమ్ములను వారానికోమారు తప్పకుండా శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
సీహెచ్సీని ప్రారంభమైన ర్యాలీ వివేకానంద విగ్రహం వరకు నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్పర్సన్ మర్రి దీపికా నర్సింహ రెడ్డి, వైస్ చైర్మన్ చీర్ల రమేశ్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు డీఎంహెచ్వో పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ ఆనంద్, డాక్టర్ కీర్తన కమిషనర్ అహ్మద్ షఫియుల్లా, కౌన్సిలర్లు జాకట దేవరాజు, తుడుం గణేశ్, పెంజర్ల నరసింహ స్వామి, బత్తుల శివ కుమార్ యాదవ్, మర్రి శ్రీనివాస్ రెడ్డి, ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, జంగ హరికృష్ణ, కౌడె మహేశ్, కో ఆప్షన్ సభ్యులు నవీన్ రెడ్డి, మహబూబ్అలీ, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శేఖర్గౌడ్, నాయకులు మర్రి నర్సింహారెడ్డి, నడికొప్పు నాగరాజు, సందీప్ గౌడ్, నారెడ్డి రవీందర్ రెడ్డి, నరేందర్, వైద్య అధికారులు గిరికాంత్, రామ్కుమార్, శ్రీధర్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.