శంషాబాద్ రూరల్, మే 14 : పట్టణ ప్రగతిలో భాగంగా శంషాబాద్ మున్సిపాలిటీ అవార్డు గెలుపొందడంపై చైర్ పర్సన్ సుష్మ, కమిషనర్ సాబేర్ అలీతో పాటు కౌన్సిలర్లను ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ శనివారం అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శంషాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ వెంకటేశ్ గౌడ్, మండలాధ్యక్షుడు చంద్రారెడ్డి, కౌన్సిలర్లు అమృతారెడ్డి, మేకల వెంకటేశ్ , నాయకులు బక్క రత్నం, ప్రవీణ్గౌడ్, శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
పేదలకు అండగా సీఎం సహాయనిధి..
శంషాబాద్ రూరల్,మే 14: సీఎం రిలీఫ్ ఫండ్తో ఎంతో మంది పేదలకు మెరుగైన వైద్యం అందుతుందని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. శనివారం శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డుకు చెందిన ముగ్గురు బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద లకు నాణ్యమైన వైద్యమందించేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆదుకుంటున్నట్లు తెలిపారు. గతంలో సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకుంటే వందల మందిలో ఒకరికీ కూడా వచ్చేదికాదని గుర్తు చేశారు.
కానీ తెలంగాణ రాష్ట్రంలో దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ డబ్బులు వస్తున్నాయని పేర్కొ న్నారు. ప్రజల ఆరోగ్యం కోసం కృషి చేస్తున్న ము ఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలందరూ రుణపడి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ వెంకటేశ్గౌడ్, చైర్ పర్సన్ సుష్మ, పార్టీ మండలాధ్యక్షుడు చంద్రారెడ్డి, కౌన్సిలర్ పెదిరిపాటి రాణి, మాజీ సర్పంచ్ బక్క రత్నం, మాజీ ఉప సర్పంచ్ ప్రవీణ్ గౌడ్, శ్రీనివాస్గౌడ్, సుధాకర్గౌడ్, యమ్మ శ్రీనివాస్,మందరవి,ప్రసాద్, హన్ముంతు పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
మణికొండ,బండ్లగూడ,మే 14: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ తెలిపారు. గండిపేట మండల పరిధిలోని బైరాగిగూడ, మంచిరేవుల గ్రామంలో సుమారుగా 600 ఇండ్లకు హెచ్ఎండబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో ఇంటింటికీ తాగునీటి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. ప్రభుత్వం నిత్యం ప్రజల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు.
గండిపేట మండల పరిధిలో ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగిరథ పథకం ద్వారా ఇంటింటికీ తాగు నీరు అందిస్తున్నామని తెలిపారు. త్వరలో మండల పరిధిలో పూర్తి స్థాయిలో నీటి ఎద్దడిని నివారిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో మేయర్ మహేందర్గౌడ్, డిప్యూటీ మేయర్ రాజేందర్రెడ్డి, నార్సింగి మున్సిపల్ వైస్ చైర్మన్ రేఖా యాదగిరి, వైస్ చైర్మన్ వెంకటేశ్యాదవ్, హెచ్ఎండబ్ల్యూఎస్ జీఎం రవీందర్, కౌన్సిలర్ మైలారం నాగపూర్ణ శ్రీనివాస్, లంకల పద్మవీరారెడ్డి, ప్రవీణ్యాదవ్,శ్రీరాములు,లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.