సిటీబ్యూరో, మే 11 (నమస్తేతెలంగాణ) : మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన 10వ స్టాండింగ్ కమిటీ సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో 10 అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. రూ. 43.65 కోట్ల వ్యయంతో ఐదు అభివృద్ది పనులు, నాలుగు అంశాలు, రోడ్డు వెడల్పునకు సంబంధించిన పనుల కోసం ఆమోదం పొందాయి. ఈ స్టాండింగ్ కమిటీ సమావేశంలో బల్దియా కమిషనర్ లోకేశ్కుమార్, ఈఎన్సీ జియావుద్దీన్, సీఈ దేవానంద్, సీపీపీ దేవేందర్రెడ్డి, అదనపు కమిషనర్ జయరాజ్ కెన్నెడీ, జోనల్ కమిషనర్లు శంకరయ్య, శ్రీనివాస్రెడ్డి, పంకజ, మమత, సామ్రాట్ అశోక్, ఎంటమాలజీ చీఫ్ రాంబాబు, అకౌంట్ చీఫ్ ఎగ్జామినర్ వెంకటేశ్వరరెడ్డి, కార్యదర్శి లక్ష్మి, స్టాండింగ్ కమిటీ సభ్యులు పన్నాల దేవేందర్రెడ్డి, మహ్మద్ అబ్దుల్ సలామ్ షాహిద్, మహపర, బతజబీన్, విజయ్కుమార్గౌడ్, మహ్మద్ రషీద్ ఫరాజుద్దీన్,ప్రేమ్ కుమార్, హేమలత తదితరులు పాల్గొన్నారు.
స్టాండింగ్ కమిటీలో ఆమోదించిన అంశాలు
అమీర్పేట పాత మారెట్ స్థానంలో రూ.13.20 కోట్లతో మోడల్ మారెట్ నిర్మాణం.
పంజాగుట్ట పాత మారెట్ స్థానంలో రూ.6.70 కోట్లతో మోడల్ మారెట్ నిర్మాణం.
ఖైరతాబాద్ ఐమాక్స్ ఎదుట న్యూ 2 బీహెచ్కె డిగ్నిటీ హౌసింగ్ కాలనీ సమీపంలో రూ.18 కోట్లతో స్టేట్ ఆఫ్ ఆర్ట్ కన్వెన్షన్హాల్ నిర్మాణం.
లాలాపేట ఫె్లైఓవర్ నుంచి మౌలాలి ఫె్లైఓవర్ వరకు రూ.3 కోట్లతో 100 ఫీట్ల బీటీ రోడ్డు.
30 మీటర్ల రోడ్డు వెడల్పునకు బండ్లగూడ తులసీనగర్ (ఉడిపి హోటల్) నుంచి వాడి-ఇ-హుడా (ఎయిర్పోర్ట్) రూట్ వయా నూరినగర్ బి.బ్లాక్ మిలాబ్నగర్ హుస్సేన్సాగర్, గౌస్నగర్, ముస్తఫాహిల్స్ వరకు 544 ఆస్తుల సేకరణ.
ప్రియదర్శిని హోటల్ (మేడ్చల్ రోడ్డు) నుంచి అంబేదర్ విగ్రహం, దుబాయి గేట్ నుంచి ఎల్బీనగర్ చివరి వరకు 60 మీటర్ల రోడ్డు వెడల్పునకు 352 ఆస్తుల సేకరణ.
అర్బన్ డ్వాక్రా గ్రూప్స్ ద్వారా నిర్వహించే ఫాగింగ్ మిషన్స్ ఒక్కో దానికి నెలకు రూ. 2,99,039 చొప్పున ఆర్నెళ్ల పాటు అద్దె చెల్లింపునకు కమిటీ ఆమోదం.
ఎల్బీనగర్ సాగర్ మెయిన్రోడ్డు నం.15 వనస్థలిపురం క్రిస్టియన్ కాలనీ నుంచి హెచ్పీ పెట్రోల్బంకు కల్వర్ట్ వరకు మురుగుకాల్వలో నీటి తొలగింపునకు రూ.2.75 కోట్లతో ఆర్సీసీ పైపు వేయడం.
ఎర్రగడ్డ మెయిన్ రోడ్డు నుంచి కె.ఎల్.ఎన్ యాదవ్ పారు ఈఎస్ఐ ప్రహరీ ఆనుకొని 12 మీటర్ల రోడ్డు వెడల్పునకు రెండు ఆస్తుల సేకరణ.
రేతిఫైల్ నుంచి ఆల్ఫా హోటల్ వరకు 36 మీటర్ల రోడ్డు వెడల్పునకు 82 ఆస్తులు, ఆల్ఫా నుంచి పాత గాంధీ ఆసుపత్రి వరకు 30 మీటర్ల రోడ్డు వెడల్పునకు 19 ఆస్తులు, ఓల్డ్గాంధీ హాస్పిటల్ నుంచి వయా మొండా మారెట్ మీదుగా సికింద్రాబాద్ వరకు 46 ఆస్తుల సేకరణకు కమిటీ ఆమోదం.