బంజారాహిల్స్, మే 11: బస్తీలు, కాలనీల్లో సమస్యలను గుర్తించడంతోపాటు పరిష్కారం చూపేందుకు గురువారం నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ‘సమస్యలపై శంఖారావం’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రతిరోజూ ఉదయం అయా బస్తీలు, కాలనీలకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటామని..జీహెచ్ఎంసీ, జలమండలి, రెవెన్యూ, విద్యుత్ తదితర అన్ని విభాగాల అధికారులు పాల్గొంటారన్నారు. 12,13 తేదీల్లో బోరబండ డివిజన్,14, 15 తేదీల్లో యూసుఫ్గూడ డివిజన్లో కార్యక్రమం ఉంటుందని చెప్పారు.