ముషీరాబాద్, మే 10: విద్యానగర్లోని శ్రీవీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయ వార్షిక వేడుకల్లో భాగంగా మంగళవారం గోవిందమాంబ సహిత వీరబ్రహ్మేంద్ర స్వామి శాంతి కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. అంతకు ముందు స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ వేడుకల్లో బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, ఆయన మాట్లాడుతూ, ఆధునిక సమాజంలో ఏం జరుగబోతున్నదో భవిష్యత్తును వంద తరాల ముందే చెప్పి సమాజాన్ని అప్రమత్తం చేసిన మహనీయులు వీర బ్రహ్మేంద్ర స్వామి అని అన్నారు.
కాల జ్ఞానియే కాకుండా హైందవ ధర్మ పరిరక్షణ కోసం కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ సభ్యుడు సీహెచ్ ఉపేందర్, విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ సంఘం అధ్యక్షుడు వడ్ల హనుమాన్లు, అంబారిపేట భార్గవి, ఆలయ కమిటీ అధ్యక్షురాలు బొమ్మోజు విజయలక్ష్మి, ప్రధాన కార్యదర్శి ఐల జయశ్రీ, ఉపాధ్యక్షురాలు రుక్మాబాయి, జాయింట్ సెక్రెటరీ పులిగల్ల అనురాధ, రమేశ్, ప్రణవాచారి, టీఆర్ఎస్ నాయకుడు మామిడి శ్రీనివాస్ పాల్గొన్నారు.