నేరేడ్మెట్, మే 28: సికింద్రాబాద్ ఆర్ఆర్సీ బ్యాడ్మింటన్ అకాడమీలో ప్రారంభమైన యోనెక్స్ సన్రైస్ హైదరాబాద్ బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బ్యాడ్మింటన్ అసోసియేషన్ హైదరాబాద్ అధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్, ఐఆర్టీఎస్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ డాక్టర్ క్రిష్టోఫర్ హాజరయ్యారు. అండర్- 13 నుంచి ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలు జరిగాయి. విజయం సాధించిన విన్నర్స్, రన్నరప్స్కు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా చాముండేశ్వరీనాథ్ మాట్లాడుతూ యువ క్రీడాకారులు మరెన్నో విజయాలను సాధించాలని ఆకాంక్షించారు. బ్యాడ్మింటన్ క్రీడాకారులను తీర్చిదిద్దుతున్న జాతీయ, అంతర్జాతీయ కోచ్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ పానీరావు, ఆర్ఆర్సీ చీఫ్ కోచ్ నాగరాజు, విక్రాంత్ తదితరులు పాల్గొన్నారు.