చిక్కడపల్లి, నవంబర్ 1: విజయం సాధించడంలో వైక ల్యం అడ్డుకాదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సతీమణి వసంతలక్ష్మి అన్నారు. మంగళవారం చిక్కడపల్లిలోని బ్రహ్మకుమారి సంస్థ లో హెలెన్కెల్లర్ మూగ, చెవిటి డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులకు చెస్, క్యారమ్స్, డ్రా యింగ్ తదిత పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వసంతలక్ష్మి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అనుకున్న లక్ష్యాన్ని సాధించడంలో వైకల్యం అడ్డుకాకూడదని విద్యార్థులకు సూచించారు. వైకల్యాన్ని జయించి జీవితంలో రాణించి సమాజానికి ఆదర్శంగా నిలువాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెలెన్కెల్లర్ డైరెక్టర్ ఖాన్, ప్రిన్సిపాల్ అంజయ్య, న్యాయవాది శ్రీదేవి, వైద్యులు హైమావతి, బ్రహ్మకుమారి సంస్థ చిక్కడపల్లి శాఖ ముఖ్యలు జయశ్రీ, శ్రీలత, రష్మిత, నర్మద, శోభ, పాల్గొన్నారు.