Hyderabad Central University | గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU)లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వర్సిటీలో విద్యార్థి సంఘాల నాయకులు పరస్పరం దాడులు చేసుకున్నారు. వర్సిటీలో త్వరలో స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా భారతీయ జనతా పార్టీకి (బీజేపీ) అనుబంధంగా ఉండే అఖిల భారత విద్యార్థి పరిషత్ (ABVP), కమ్యూనిస్టు పార్టీకి చెందిన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI)కు చెందిన విద్యార్థులు పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.