మల్కాజిగిరి, ఆగస్టు 8 : తల్లిపాలు బిడ్డ ఆరోగ్యానికి రక్షణ ఇస్తుందని అల్వాల్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ భాగ్యలక్ష్మి అన్నారు. సోమవారం అల్వాల్లోని రాజీవ్ వీకర్ సెక్షన్ బస్తీలో అల్వాల్ సెక్టార్లోని 34 అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎక్స్టెన్షన్ ఆఫీసర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. గర్భిణులు ప్రభుత్వ దవాఖానలో ప్రసవాలు నిర్వహించుకోవాలని, వారికి రూ.12వేల ఆర్థిక సహాయంతోపాటు బిడ్డకు రూ.2వేల విలువగల కేసీఆర్ కిట్లు అందజేస్తున్నామని అన్నారు. తల్లి ప్రసవించిన గంటలోపు బిడ్డకు పాలు ఇవ్వాలన్నారు. చాలా మంది తల్లులు మూఢ నమ్మకంతో బిడ్డ పుట్టిన తర్వాత వచ్చేపాలను ఇవ్వడం లేదని.. దీంతో అంగన్వాడీ సెంటర్ల పరిధిలోని గర్భిణులను గుర్తించి.. వారికి ముందస్తుగా అవగాహన కల్పిస్తున్నామని అన్నారు.
గర్భిణులకు అంగన్వాడీ సెంటర్ల ద్వారా ప్రతి రోజు పోషకాహారాలతో కూడిన పదార్థాలను అందజేస్తున్నామని అన్నారు. తల్లిపాలు తా గిన బిడ్డల్లో వ్యాధులు సోకకుండా రక్షణ శక్తి పెరుగుతుందని అన్నా రు. బిడ్డకు ఆరు నెలల వరకు తప్పకుండా తల్లిపాలు ఇవ్వాలని అన్నారు. తల్లిపాలు ఇవ్వడంవల్ల తల్లీబిడ్డ శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. కార్యక్రమంలో అంగన్ వాడీ టీచర్లు అరుణరాణి, అంజమ్మ, రేణుక, శ్రీవేణి, రాధిక, తదితరులు పాల్గొన్నారు.