సిటీబ్యూరో, జూన్ 21(నమస్తే తెలంగాణ): తెలంగాణలో లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత వచ్చిన వీకెండ్ను నగరవాసులు ఫుల్ ఎంజాయ్ చేశారు. నగరం నడిబొడ్డునున్న హుస్సేన్సాగర్ తీరంలో ని పార్కులను 1,28,060 మంది సందర్శించారు. ఇందులో లుంబనీ పార్కును 60,690, ఎన్టీఆర్ పార్కును 54,310, సంజీవయ్య పార్కు ను 12,480, లేక్ వ్యూ పార్కును 580 మంది సందర్శించిన వారిలో ఉన్నారు. లాక్డౌన్ విధించిన తర్వాత దాదాపు రెండు మూడు నెలల అనంతరం ప్రజలంతా బయటకు వెళ్లేందుకు అవకాశం రావడంతో ఒక్కసారి కుటుంబ సమేతంగా పబ్లిక్ ప్లేస్లోకి వచ్చి సేద తీరారు.
హుస్సేన్సాగర్ పరిధిలో 4 పార్కు లుండగా, వాటిలో ప్రవేశానికి రుసుం ఉంటుంది. అయితే, నెక్లెస్ రోడ్డులోని ల్కాండ్ స్కేప్స్, పీపుల్ ప్లాజా, పీవీ ఘాట్ పార్క్, ట్యాంక్బండ్ ప్రాంతాల్లో ఎవరైనా సేదతీరే అవకాశముంది. సుమారు 6 కి.మీ పొడవునా నెక్లెస్ రోడ్డులో వేలాది మంది సరదాగా గడిపేందుకు వచ్చారని బుద్ధ్ద పూర్ణిమ ప్రాజెక్టు అథారిటీ అధికారులు తెలిపారు.
మాదాపూర్లోని శిల్పారామం సోమవారం సందర్శకులతో కిటకిటలాడింది. లాక్డౌన్ తర్వాత పూర్తిస్థాయిలో సందర్శకులను అనుమతిస్తుండడంతో నగరవాసులు సందడి చేశారు. ఆహ్లాదకర వాతావరణంలో కుటుంబ సమేతంగా తరలివచ్చారు. బోటింగ్లో షికారు చేస్తూ సంబురపడ్డారు.