ఘట్ కేసర్ : కుటుంబ కలహాలు, భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యను సిమెంట్ ఇటుకతో కొట్టి హత్య చేసిన ఘటన మేడ్చల్ మల్కాగిజిరి జిల్లా ఘట్ కేసర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ద్వారకానగర్లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా కిలగనూర్ మండలం సలకలపూర్కు చెందిన మాధవి (37)కి 18 ఏళ్ల క్రితం కాట్రావత్ రాజు (44)తో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు కాగా, గత 15 ఏళ్లుగా ఘట్ కేసర్లో నివాసముంటున్నారు.
గత మూడేళ్లుగా రాజు మద్యానికి బానిసై భార్యను అనుమానిస్తూ తరచూ వేధించేవాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి మద్యం మత్తులో భార్య ఛాతీపై సిమెంట్ ఇటుకతో దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయింది. కుటుంబ సభ్యులు 108లో దవాఖానకు తరలించగా, చికిత్సకు ముందే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు రాజుపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.