సిటీబ్యూరో, అక్టోబరు 5 (నమస్తే తెలంగాణ): హనీట్రాప్లో పడ్డ యువకుడు తనను కాపాడాలంటూ రాచకొండ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. ఘట్కేసర్కు చెందిన ఓ యువకుడికి ఫేస్బుక్లో ఉత్తరాది రాష్ర్టానికి చెందిన యువతి పరిచయమైంది. ఆ తర్వాత వాట్సాప్ నంబర్లు తీసుకొని హనీట్రాప్లోకి దింపింది. ఓ రోజు వాట్సాప్లో నగ్నంగా వీడియో కాల్ చేసి యువకుడిని రెచ్చగొట్టింది. దీంతో యువకుడు కూడా నగ్నంగా మారగా 40 సెకన్ల వీడియో రికాైర్డెంది. దీన్ని తిరిగి యువకుడికి పంపిన సైబర్ నేరగాళ్లు రూ.3 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో భయాందోళనకు గురైన యువకుడు రాచకొండ పోలీసులను ఆశ్రయించాడు. తనను బ్లాక్మెయిల్ చేస్తున్న వారిని పట్టుకొని పరువు కాపాడాలని ఫిర్యాదు చేశాడు.