యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సలహాదారు, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్
సిటీబ్యూరో, జూలై 28(నమస్తే తెలంగాణ): సమాజంలో నిజాయితీగా విధులు నిర్వర్తించే అధికారులు చాలా మంది ఉన్నారని, వారిని మనం గౌరవించుకున్నప్పుడే అలాంటి వారి సంఖ్య పెరుగుతుందని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సలహాదారుడు, ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ అన్నారు.
పని తీరు బాగున్న అధికారుల సమాచారం అందిస్తే తమ సంస్థ తరపున వారి ని సత్కరిస్తామని చెప్పారు. గురువారం యూత్ ఫర్ యాంటీ కరప్షన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడా రు. ఆగస్టు 28న నిజాయితీ అధికారులకు సత్కార కార్యక్రమం హైదరాబాద్ లో నిర్వహిస్తున్నామని పలు వివరాలు వెల్లడించారు.