సిటీబ్యూరో, జూన్ 24(నమస్తే తెలంగాణ): ఈ నెల 25వ తేదీ (నేటి) రాత్రి 10 గంటల నుంచి శుక్రవారం (26వ తేదీ) రాత్రి 10 గంటల వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని జలమండలి ఎండీ దాన కిశోర్ తెలిపారు. జలమండలి నీటి సరఫరా చేస్తున్న కృష్ణా ఫేస్-3 రింగ్ మెయిన్ టోలిచౌకి ప్రాంతంలోని ఎస్బీఐ బ్యాంకు నుంచి ఆర్చీస్ స్టోన్ వరకు గల 1,400 ఎంఎం డయా ఎమ్ఎస్ పంపింగ్ మెయిన్కు జంక్షన్ పనులు చేపడుతున్నందున అంతరాయం కలుగుతుందని, ఆయా ప్రాంతాల్లోని జలమండలి వినియోగదారులు నీటిని పొదుపుగా వాడాలని సూచించారు. షేక్పేట్ రిజర్వాయర్ ప్రాంతాలు, జూబ్లీహిల్స్, ఫిల్మ్నగర్, ప్రశాసన్నగర్, తట్టిఖాన, గచ్చిబౌలి, మాదాపూర్, అయ్యప్ప సొసైటీ, కావూరి హిల్స్ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని జలమండలి ఎండీ జారీ చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.