సిటీబ్యూరో, అక్టోబరు 8(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా నగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న కృష్ణా ఫేస్-1, 1200 ఎంఎం డయా ఎం ఎస్ గ్రావిటీ మెయిన్ పైపులైన్కు మరమ్మతులు జరుగుతున్న దృష్ట్యా మార్పు లు, చేర్పులు జరుగుతున్నాయి. చాంద్రాయణగుట్ట ఓమర్ హోటల్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం జరగనున్న నేపథ్యంలో మీరాలం అలియాబాద్ ఆఫ్ టేక్ పైప్లైన్ అలైన్మెంట్ మార్పు అనివార్యమైంది. దీంతో ఈ నెల 11 సోమవారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు మంగళవారం ఉదయం 6 గంటల వరకు మొత్తం 24 గంటల పాటు ఈ పనులు కొనసాగుతాయి. ఈ 24 గంటల వరకు మీరాలం అలియాబాద్ ఆఫ్ టేక్ నుంచి నీటి సరఫరా జరిగే రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాల్లో మంచినీటి సరఫరాలో అంతరా యం ఏర్పడుతుందని అధికారులు శుక్రవారం తెలిపారు. మీరాలం, కిషన్ బాగ్, అల్ జుబైల్ కాలనీ రిజర్వాయర్ ప్రాంతాలు. అలియాబాద్, బాలాపూ ర్ రిజర్వాయర్ ప్రాంతాలలో నీటి సరఫరా ఉండదన్నారు.