సిటీబ్యూరో, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శివారు మున్సిపాలిటీల్లో మురుగు నీటి నిర్వహణ బాధ్యత నేటినుంచి జలమండలి చేతిలోకి వెళ్లింది. గ్రేటర్లోకి అదనంగా 66 డివిజన్ల పరిధిలో 3,600 కిలోమీటర్ల మేర మురుగునీటి వ్యవస్థ నిర్వహణ చేరింది. నేటినుంచి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల కోసం వార్డు కార్యాలయాల్లో ప్రత్యేకంగా నమోదు రిజిస్టర్ను ఏర్పాటు చేశారు. ప్రజలు తమ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు జలమండలి 155313 నంబర్కు కాల్ చేయాలని అధికారులు సూచించారు.