సిటీబ్యూరో, ఆగస్టు 6 (నమస్తేతెలంగాణ): కృష్ణా ఫేజ్-3 రింగ్ మెయిన్-2 పీర్జాదిగూడలోని పైపులైన్కు వాల్వ్లు అమర్చుతున్నందున శనివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. బోడుప్పల్, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లు, పోచారం, అల్వాల్ మున్సిపాలిటీలు, మౌలాలి, హౌసింగ్ బోర్డు, నాచారం, సైనిక్ఫురి, కాప్రా, కుత్బుల్లాపూర్, హస్మత్పేట, గన్రాక్ ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదన్నారు. అలాగే ఈనెల 9వ తేదీన కూడా మరికొన్ని ప్రాంతాల్లో తాగునీటి సరఫరా జరగదని చెప్పారు.