ఇవాళ (ఫిబ్రవరి 28) ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా హైదరాబాద్లోని చాంద్రాయణగుట్టలో ఉన్న సీఆర్పీఎఫ్ గ్రూప్ సెంటర్లో అత్యంత ఎత్తులో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సౌత్ జోన్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ రష్మీ శుక్లా హాజరయ్యారు. సుమారు 60 ఫీట్ల ఎత్తులో అతి పెద్ద జాతీయ జెండాను సీఆర్పీఎఫ్ ఆవిష్కరించింది. జెండా సైజు 18 ఫీట్ల పొడవు, 12 ఫీట్ల వెడల్పు ఉంది.
సీఆర్పీఎఫ్కు చెందిన జవాన్లు, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం సీఆర్పీఎఫ్ బ్యాండ్ ఆధ్వర్యంలో జాతీయ గీతం, దేశభక్తి గీతాలను ఆలపించారు.