మాదాపూర్, అక్టోబర్ 17: మాదాపూర్లోని హెచ్ఐసీసీలో ఈ నెల 28న హై లైఫ్ బ్రైడ్ ఎగ్జిబిషన్ ప్రారంభం కానున్నది. ఈ మేరకు ఆదివారం ప్రముఖ నటీమణులు అర్చన రవి, ద్రిషికా చందర్, వెన్నెలతో కలిసి హై లైఫ్ బ్రైడ్ ఎగ్జిబిషన్ నిర్వాహకుడు డోమినిక్ బ్రోచర్ను ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 28న ప్రారంభం కానున్న ఈ ప్రదర్శన మూడు రోజుల పాటు నగరవాసులకు అందుబాటులో ఉంటుందని అన్నారు. చెన్నై, సూరత్, కొచ్చి, బెంగళూరు, ముంబయితో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన ప్రముఖ డిజైనర్లతో రూపొందించిన వస్ర్తాలు ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంటాయని వివరించారు. సరికొత్త డిజైన్లతో రూపొందించిన బంగారు ఆభరణాలు నగర వాసులను ఆలరించడం ఖాయమన్నారు. అనంతరం నటీమణులు, మోడల్స్ చేసిన క్యాట్వాక్ ఆకట్టుకున్నాయి.