సైదాబాద్, డిసెంబర్ 11 : రాష్ట్ర ప్రభుత్వం టీఎస్సీఎస్సీ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులను ప్రక్షాళన చేసిన తర్వాతే నియామక పరీక్షలు నిర్వహించి, నిరుద్యోగుల ఆకాంక్ష నెరవేర్చాలని హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ అన్నారు. సోమవారం సైదాబాద్ డివిజన్ పరిధిలో కల్యాణ్నగర్ కాలనీలోని తన నివాసంలో నిరుద్యోగ బాధిత యువకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ రిక్రూట్మెంట్కు సంబంధంలేని ఓవో 57, 58లను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ వేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బోర్డులు ఇంత వరకు పాల్పడ్డ అవకతవకలపై విచారణ జరిపించాలని, బోర్డుల చైర్మన్లను వెంటనే తొలగించాలని, సీబీఐతో విచారణ జరిపించడం ద్వారా అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. ఈ సమావేశంలో నిరుద్యోగ బాధిత యువకులు యాసం ప్రదీప్, నర్సింహ, రాజు, పరుశురాం, కోటేశ్ తదితరులు పాల్గొన్నారు.
నేడు చలో ప్రజా భవన్
తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం మంగళవారం చలో ప్రజా భవన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని యాసం ప్రదీప్, నర్సింహ, రాజు, పరుశురాం, కోటేశ్ కోరారు. నసిక ఆరోగ్య సేవలు విస్తరించాలి