హైదరాబాద్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ కంపెనీ సెక్రటరీ వై. శైలజకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ను సోమవారం మంజూరు చేసింది. కార్వీలో అక్రమాలపై రెండు కేసుల్లో బెయిల్ ఇచ్చేందుకు కింది కోర్టు నిరాకరించడంతో హైకోర్టులో దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్లో న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత బెయిల్ ఉత్తర్వులు జారీ చేశారు.
25 వేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తు, అంతే విలువైన మరో రెండు పూచీకత్తులను సమర్పించాలని పిటిషనర్ను ఆదేశించారు. శైలజను అరెస్ట్ చేసి 90 రోజులు అయ్యిందని, చార్జిషీటు దాఖలు చేయలేదని ఆమె తరఫు న్యాయవాది పి.విక్రమ్ వాదించారు. దర్యాప్తు పూర్తి అయ్యిందని, చార్జిషీటు వేస్తామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రతాప్రెడ్డి చెప్పారు. అరెస్ట్ చేసి 90 రోజులు అయినందున బెయిల్ మంజూరు చేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు.