హైదరాబాద్ : తెలంగాణనను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తామని ప్రభుత్వం చెబుతున్నా ఆచరణలో మాత్రం అలాంటి దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట గంజాయి పట్టుబ డుతూనే ఉంది. తాజాగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో (Secunderabad railway station) భారీగా గంజాయిని(Cannabis Seizure) పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్రకు చెందిన సునీత నుంచి 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువు సుమారు రూ.5 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.