జూబ్లీహిల్స్, జూలై 22 : యూసుఫ్గూడ ఫస్ట్ బెటాలియన్లో శుక్రవారం హరితహారం కార్యక్రమం నిర్వహించారు. కమాండెంట్ ఏకే మిశ్రా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో టీఎస్ఎస్పీ అడిషనల్ డీజీపీ అభిలాష బిస్త్, డీఐజీ సిద్దిఖీ పాల్గొని ఇతర అధికారులతో కలిసి 500 మొక్కలు నాటారు.
కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ కె.వీరయ్య, అసిస్టెంట్ కమాండెంట్లు జె.రాందాసు, అప్పరాయ్, రంగారెడ్డి, కేపీ సత్యనారాయణ, బి.జవహర్లాల్, ఆర్ఐలు ఎస్.సురేశ్, టి.ధర్మారావు, టి.సాంబయ్య, ఎండీ.జాఫర్, వై.రవీందర్, ఆర్.శంకర్, పి.సురేశ్, ఆర్ఎస్లు, సిబ్బంది పాల్గొన్నారు.