రవీంద్రభారతి, ఫిబ్రవరి 3: తెలుగు వారికే సొంతమైన హరికథలను పరిరక్షించుకొని భావితరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ అన్నారు.
ప్రభుత్వ సలహాదారుడు డాక్టర్ కేవీ రమణాచారి 71వ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని శుక్రవారం రవీంద్రభారతిలోని ఘంటసాల ప్రాంగణంలో గరిమెళ్ల సత్యవతి భాగవారిణి (మదనపల్లి)గారిచే ‘విరాటపర్వం’ హరికథాగానాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆచార్య కొలకలూరి ఇనాక్ హాజరై మాట్లాడారు. అంతరించిపోతున్న హరికథలకు పూర్వ వైభవం తేవాల్సిన అవసరం ఉందన్నారు.