హైదరాబాద్, మార్చి 16 : మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పుట్టినరోజును పురస్కరించుకుని టీజీవో నేతలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. హైదరాబాద్ ఆలియా ఉన్నత పాఠశాలలో జిల్లా అధ్యక్షకార్యదర్శులు ఎంబీ కృష్ణాయాదవ్, డాక్టర్ హరికృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు, బిస్కెట్లను పంపిణీ చేశారు. కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, రవీంద్రకుమార్, కృష్ణమూర్తి, సుజాత, గండూరి వెంకటేశ్వర్లు, వెంకటయ్య, అరుణ్కుమార్, లక్ష్మణ్గౌడ్, శిరీష, హుస్సేన్ అలీ, గోపాలకృష్ణ పాల్గొన్నారు.
సుల్తాన్బజార్,మార్చి 16 : మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ పుట్టినరోజు సందర్భంగా మల్లేపల్లి ఐటీఐ ఆవరణలో టీజీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు ఎంబీ కృష్ణాయాదవ్, అధి కారులు, ఉద్యోగులు, విద్యార్థులతో కలిసి మొక్కలను నాటారు.
లాల్బహుదూర్ స్టేడియం సాట్స్లో ..
హైదరాబాద్ ఆట ప్రతినిధి, మార్చి 16 : మంత్రి శ్రీనివాస్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా లాల్బహుదూర్ స్టేడియంలోని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి కేక్ కట్ చేశారు. టీజీవో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ సుజాత ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ జిల్లా టీజీఓ అధ్యక్షుడు కృష్ణ యాదవ్, ప్రధాన కార్యదర్శి, స్పోర్ట్స్ స్కూల్ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ హరికృష్ణ, సాట్స్ అధికారులు ధనలక్ష్మి, కల్యాణి, సబిత, రమాదేవి, కోచ్లు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో..
రవీంద్రభారతి, మార్చి 16 : మంత్రి వి. శ్రీనివాస్గౌడ్ పుట్టినరోజు సందర్భంగా రవీంద్రభారతిలో తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గంధం రాములు కేక్ కట్చేశారు. కోల శ్రీనివాస్, దుండగుల రామకృష్ణ, మోహన్నాయక్, సంపత్కుమార్, డాశ్రునాయక్, శంకర్గౌడ్, నారాయణ పవర్, మహిళా విభాగం నాయకులు నిర్మాలరెడ్డి, సాయిలక్ష్మి, వాణి, హరిణి, శాంతి పాల్గొన్నారు.
వీఎస్జీ క్రికెట్ చాంప్ లాల్బహదూర్ స్టేడియం క్రికెట్ జట్టు
రాష్ట్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పుట్టినరోజును పురస్కరించుకొని నిర్వహించిన టీ-20 వీఎస్జీ క్రికెట్ చాంపియన్షిప్ను లాల్బహదూర్ స్టేడియం క్రికెట్ జట్టు సొంతం చేసుకుంది. ఫైనల్స్లో మొదటగా బ్యాటింగ్ ఎంచుకున్న సరూర్నగర్ క్రికెట్ జట్టు 9 వికెట్ల నష్టానికి 127పరుగులు చేయగా.. తర్వాత బ్యాటింగ్కు దిగిన లాల్బహదూర్ స్టేడియం క్రికెట్ జట్టు 6 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసి గెలుపొందింది.