సుల్తాన్బజార్, మే 26: ఉస్మానియా దవాఖానలో వైద్య సేవలు పొందుతున్న పేద రోగులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి తమ వంతు సహకారాన్ని అందించడం అభినందనీయమని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ అన్నారు.
శుక్రవారం దవాఖాన ఆడిటోరియంలో నిర్వహించిన సమావేశంలో హెచ్ఏఎల్ జనరల్ మేనేజర్ అరుణ్ జె సర్కాటే తమ సంస్థ ప్రతినిధులతో కలిసి దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్కు రూ. 9.5 కోట్ల విలువైన వైద్య పరికరాలను విరాళంగా అందజేశారు. కార్యక్రమంలో ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ శశికళరెడ్డి, నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్ మనీష సహాయ్, హెచ్ఏఎల్ జాగృతి లేడిస్ క్లబ్ చీఫ్ ప్యాట్రన్ వనిత సర్కాటే తదితరులు పాల్గొన్నారు.