సిటీబ్యూరో, జనవరి 5(నమస్తే తెలంగాణ) : పతంజలి యోగ్పీఠ్ 29వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం గురుకుల్ లైబ్రరీని భారత రక్షణ శాఖ మంత్రి చంబాపూర్లో ప్రారంభించనున్నట్లు స్వామి రాందేవ్బాబా తెలిపారు. యోగపీఠ్ మహర్శి దయానంద సరస్వతి 200వ జయంతిని పురస్కరించుకొని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
హరిద్వార్లో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ.. పతంజలి గురుకుల విధానాన్ని స్వామి దర్శనంద్ 118 ఏండ్ల క్రితమే ప్రారంభించారని గుర్తుచేశారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిందని చెప్పారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థికశాఖ మంత్రి, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ సీఎంలతోపాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు వెల్లడించారు.