సిటీబ్యూరో, మార్చి 20 (నమస్తే తెలంగాణ) : ఆర్థిక వ్యవస్థ వృద్ధికి స్టార్టప్లు దోహదం చేస్తాయని, అలాంటి స్టార్టప్లను(Startups) ప్రోత్సహించేందుకు టీ హబ్లో(T – Hub) నిరంతరం పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని టీహబ్ సీఈఓ ఎం.శ్రీనివాసరావు అన్నారు. బుధవారం టీ హబ్లో భవిష్యత్ ఆర్థిక అంశంపై ప్రత్యేకంగా సదస్సును నిర్వహించారు.
ఈ సదస్సుల్లో పాల్గొన్న శ్రీనివాసరావు మాట్లాడుతూ.. టీహబ్ వేదికగా కొత్త ఆలోచనలతో వచ్చే స్టార్టప్లకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తున్నామని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా కొత్తగా అభివృద్ధి చెందుతున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలతో నేటి యువతరం స్టార్టప్ల ఏర్పాటు చేసి, విజయవంతంగా కార్యకలాపాలను నిర్వహించాలన్న లక్ష్యం కలిగి ఉన్నారు. అలాంటి వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించడం ద్వారా ఆర్థికంగా వృద్ధి చెందేందుకు అవకాశాలున్నాయని తెలిపారు.