సిటీబ్యూరో, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ) : మలక్పేట్ యశోధ దవాఖాన నుంచి సికింద్రాబాద్ కిమ్స్ దవాఖాన వరకు బుధవారం నగర ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ చానల్ ఏర్పాటు చేశారు. యశోధ నుంచి లైవ్ ఆర్గాన్స్(ఊపిరితిత్తులు) తీసుకొని 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిమ్స్ దవాఖానకు అంబులెన్స్ వాహనం 13 నిమిషాల్లో చేరుకుందని ఇన్చార్జి ట్రాఫిక్ అదనపు సీపీ శిఖా గోయెల్ తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 29సార్లు గ్రీన్చానల్ ఏర్పాటు చేసి అవయవాల రవాణాలో తమ వంతు సహకారాన్ని అందించామన్నారు.