సిటీబ్యూరో, మే 26 (నమస్తే తెలంగాణ): నగరంలో ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వాయువ్య పశ్చిమ దిశల నుంచి వీస్తున్న కింది స్థాయి గాలుల ప్రభావంతో గ్రేటర్లో మళ్లీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 38.0, కనిష్ఠం 27.9 డిగ్రీలు, గాలిలో తేమ 28 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.