సిటీబ్యూరో, నవంబర్ 5 ( నమస్తే తెలంగాణ) ; భాగ్యనగరంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. సకల వసతులతో అలరారుతున్నది. ప్రతి రంగంలో గణనీయమైన ప్రగతిని నమోదు చేస్తున్నది. పేదలు, సామాన్యులను అక్కున చేర్చుకుని వారికి అవసరమైన వసతులను కల్పించి.. తెలంగాణ ప్రభుత్వం మనసున్న సర్కారుగా నగరవాసుల్లో చెరగని ముద్ర వేసుకున్నది.
భాగ్యనగరం సకల వసతులతో అలరారుతున్నది. గ్రేటర్ అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. ప్రతి రంగం గణనీయమైన ప్రగతిని నమోదు చేస్తున్నది. పేదలు, సామాన్యులను అక్కున చేర్చుకుని వారికి అవసరమైన వసతులను కల్పించి.. తెలంగాణ ప్రభుత్వం మనసున్న సర్కారుగా నగరవాసుల్లో చెరగని ముద్ర వేసుకుంది. కోట్ల రూపాయలు వెచ్చించి వైభవంగా వేడుకలు నిర్వహించుకునేలా మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్లు.. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఓపెన్ జిమ్లు.. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా సకల సదుపాయాలతో వ్యాపారులకు మేలు
జరిగేలా మోడల్ మార్కెట్లు, క్రీడాకారులకు ఉపయోగపడేలా ఆట మైదానాలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్లు వంటివి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ
తొమ్మిదిన్నరేండ్లలో ఊహించని అభివృద్ధి గ్రేటర్లో జరిగిందని నగరవాసులు ప్రశంసిస్తున్నారు.
రూ. 90 కోట్లతో 31 చోట్ల మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్లు
ఆరోగ్యాన్నిచ్చే ఓపెన్ జిమ్లు..
నగరవాసులు ఆరోగ్యాన్ని కాపాడుకునేలా జీహెచ్ఎంసీ ఓపెన్ జిమ్లకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నది. నెలకు వేలల్లో ఫీజులు చెల్లించి దేహదారుఢ్యాన్ని మలుచుకునే పరిస్థితికి దూరంగా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా బల్దియా ముఖ్యమైన పార్కుల్లో ఓపెన్ జిమ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వివిధ కమ్యూనిటీ హాళ్లు, సంక్షేమ సంఘాల్లో 135 ఆధునిక జిమ్లు/ఫిట్నెస్ కేంద్రాలు ఉండగా, బహిరంగ ప్రదేశాల్లో 135 చోట్ల ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేశారు. జోనల్ స్థాయిలో వీటి నిర్వహణ జరుగుతున్నది. ప్రజల డిమాండ్కు అనుగుణంగా ఆధునిక జిమ్లు, ఓపెన్ జిమ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు జీహెచ్ఎంసీ పరిధిలో 270 జిమ్ సెంటర్లు ఉన్నాయని, రాబోయే రోజుల్లో వీటి సంఖ్యను మరింత పెంచనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
అత్యాధునిక హంగులతో..
లక్షలు పోసిన ప్రైవేట్ ఫంక్షన్ హాళ్లలో లభించని సేవలు ప్రభుత్వం నిర్మించిన మల్టీపర్పస్ ఫంక్షన్హాళ్లలో లభిస్తున్నాయి. కేవలం రూ. 27, 500లతో ఒకేసారి రెండు వేల మందితో వేడుక నిర్వహించేలా సౌలభ్యంతో నిర్మించారు. కండ్లు మిరుమిట్లు గొలిపే, జూమర్ లైట్లు, అద్దంలాంటి ఫ్లోరింగ్, సామగ్రితో కూడిన వంటగది, వివాహ వేడుకల కోసం వధువరులను ముస్తాబు చేసేందుకు ప్రత్యేక గదులు, బంధుమిత్రులకు విడిది వసతి, సురక్షిత తాగునీరు ఇలా సకల సౌకర్యాలతో ఈ ఫంక్షన్ హాళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.అయితే పెండ్లిండ్ల సీజన్లో ఒక్కో ఫంక్షన్ హాళ్లలో నెలకు 15 నుంచి 20 ఫంక్షన్లు జరుగుతున్నాయి. ఇతర సమయాల్లో నెలకు 4 లేదా 5 వరకు మాత్రమే ఫంక్షన్లు జరుగుతున్నాయని, సామాన్యులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని అధికారులు తెలిపారు.వేడుకలు లేని సందర్భంగా ఈ ఫంక్షన్హాళ్లు బతుకమ్మ చీరల పంపిణీ వంటి ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాలు, వైద్య శిబిరాలు,యువతకు ఉపాధి అవకాశాల అవగాహన శిబిరాలు, రక్తదాన శిబిరాలకు వేదికగా నిలుస్తున్నాయి.
గ్రేటర్లో 521 ఆట మైదానాలు, 26 స్పోర్ట్స్ కాంప్లెక్స్లు, 13 స్విమ్మింగ్పూల్స్, 5 టెన్నీస్ కోర్ట్స్, 11 స్కేటింగ్ రింక్స్ అందుబాటులో ఉన్నాయి. ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, లాంగ్జంప్,ఎక్సర్సైజ్ బార్ సింగల్ క్రీడలకు ప్రాధాన్యతనిస్తున్నారు.సుమారు 1.50 లక్షల మంది ప్రతి నెలా ఈ ఆట మైదానాల్ని ఉపయోగిస్తున్నారు.
ఆధునిక మార్కెట్లు
గ్రేటర్లో ప్రతి పది వేల మంది జనాభాకు మార్కెట్ను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నది. కూరగాయలు, మాంసాహారం ఒకే ప్రదేశంలో లభ్యమయ్యే విధంగా పాత మార్కెట్ స్థలాల్లో నూతనంగా మోడల్ మార్కెట్ల నిర్మాణాలను చేపడుతున్నది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 8 మార్కెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మరో ఎనిమిది చోట్ల పనులు చేపట్టారు. మొత్తంగా ఇప్పటి వరకు రూ.19.38 కోట్లు ఖర్చు పెట్టి 38 మోడల్ మార్కెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. రూ. 63.90 కోట్లతో నాలుగు చోట్ల పనులకు శ్రీకారం చుట్టారు. రూ.4 కోట్లతో నారాయణగూడ ఓల్డ్ మున్సిపల్ వెజిటేబుల్ మార్కెట్ వద్ద మోడల్ మార్కెట్ అందుబాటులోకి రానున్నాయి. చిక్కడపల్లిలో రూ.40 కోట్లతో చేపట్టారు. దీంతో పాటు అమీర్పేట, పంజాగుట్ట మోడల్ మార్కెట్లు పురోగతిలో ఉన్నాయి. రూ. 19.40 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఐదు ఫిష్ మారెట్లకు శ్రీకారం చుట్టిన అధికారులు.. ఇప్పటికే నాచారం, కూకట్పల్లి మారెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. కాగా, మోడల్ మార్కెట్లు అందుబాటులోకి రావడంతో ప్రజలకు నాణ్యమైన కూరగాయలు, శుభ్రమైన మాంసాహారం, చేపలు లభించడమే కాకుండా ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పడినట్లయింది. గతంలో నగరంలో రోడ్లపై అమ్మడం వల్ల ట్రాఫిక్ సమస్య ఎకువగా ఎదురవుతున్న పరిస్థితి. తద్వారా రవాణాకు ఆటంకం కలుగుతున్నది. ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని నగరంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా నిర్దేశిత ప్రదేశాలను గుర్తించి ఈ మోడల్ మారెట్ల నిర్మాణాలపై జీహెచ్ఎంసీ దృష్టి సారించి చర్యలు చేపడుతున్నది.
రోజంతా హుషారుగా..
రూ.30.10కోట్లతో అందుబాటులోకి వచ్చిన 9 ఫంక్షన్ హాళ్లు ఇవే ..
ప్రాంతం ఖర్చు చేసినవి (రూ. కోట్లలో)
మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్ల ప్రత్యేకతలు
చెల్లించాల్సిన అద్దె..
జీహెచ్ఎంసీ నిర్మించిన మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ అద్దె కేవలం రూ.27,500 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.
అది కూడా వ్యక్తులకు కాకుండా ‘జీహెచ్ఎంసీ, కమిషనర్’ పేరుతో జాతీయ బ్యాంకు నుంచి డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకుని, స్థానిక జీహెచ్ఎంసీ సర్కిల్ రెంట్ కంట్రోల్ అధికారికి అందజేసి, రశీదు తీసుకోవాలి.
జీహెచ్ఎంసీ పరిధిలో జిమ్ల వివరాలు (జోన్ల వారీగా)..
జోన్ ఓపెన్ జిమ్లు మోడ్రన్ జిమ్/ఫిట్నెస్ సెంటర్స్