మేడ్చల్జోన్బృందం, డిసెంబర్ 27: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా కార్పొరేషన్లు,మున్సిపాలిటీలు, మండలాల్లో అధికారులు గ్రామసభలు నిర్వహించి ఆరు గ్యారెంటీ పథకాలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమంపై కార్పొరేషన్లు,మున్సిపాలిటీలు, మండలాల్లో అధికారులు బుధవారం అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు మాట్లాడుతూ గురువారం నుంచి ఉదయం8గంటలనుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ప్రజలనుంచి దరఖాస్తులను స్వీకరిస్తారని తెలిపారు.గ్రామాల్లో రోజువారీగా నిర్వహించే కార్యక్రమాలపై ప్రత్యేక అధికారుల ఏర్పాటుతో పాటు తేదీలను ప్రకటించారు.కాగా మేడ్చల్, తూంకుంట, ఘట్కేసర్, పోచారం మున్సిపాలిటీల్లో గురువారం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు కమిషనర్లు త్రిల్లేశ్వర్రావు,జేతూరామ్నాయక్, కమిషనర్లు వేమన రెడ్డి, ఎండీ సాబేర్ అలీ తదితరులు పేర్కొన్నారు.
ప్రభుత్వాదేశాల మేరకు బుధవారం శామీర్పేట మం డల పరిషత్ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమం లో ఎంపీపీ ఎల్లూభాయిబాబు, జడ్పీటీసీ అనితలాల య్య, వైస్ ఎంపీపీ సుజాత, ఎంపీవో మంగతాయారు, డిప్యూటీ తహసీల్దార్ ప్రసన్న, సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు, కార్యదర్శులు, కారోబార్లు పాల్గొన్నారు.
ఈనెల 28తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు జరుగు తున్న ప్రజాపాలన కార్యక్రమంలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం పై మేయర్, డిప్యూటీ మేయర్ శివకుమార్గౌడ్, కమిషనర్ ఇస్లావత్ నమ్యతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, కో ఆప్షన్ మెంబర్లు, అధికారులు ఉన్నారు.
ఆరు గ్యారెంటీలను ప్రజలకు అందించేందుకు దరఖాస్తుల స్వీకరిస్తున్నట్లు పోచారం, ఘట్కేసర్ మున్సిపాలిటీలో కమిషనర్లు జేతురామ్నాయక్, వేమనరెడ్డి, ఎండీ సాబేర్ అలీ బుధవారం ప్రకటనలో పేర్కొన్నారు. అదే విధంగా ఘట్కేసర్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఏనుగు సుదర్శన్రెడ్డి ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణపై మండల స్థాయిలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో ఎంపీడీవో అరుణ, ఎం పీవో నందకిశోర్, ఏవో బాసిత్, డిప్యూటీ తహసీల్దార్ సందీప్, అధికారులు పాల్గొన్నారు.
నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీల్లో చైర్మన్లు కౌకుంట్ల చంద్రారెడ్డి, ప్రణీతశ్రీకాంత్గౌడ్లు ప్రభుత్వ గ్యారెంటీలపై అవగాహన సదస్సులు బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్లు రాజేందర్కుమార్, రాజమల్లయ్య, వైస్ చైర్మన్లు నరేందర్రెడ్డి, మల్లేశ్యాదవ్, మేనేజర్లు చంద్రశేఖర్, వెంకటేశం, డీఈఈలు రఘు, చిరంజీవులు, కౌన్సిలర్లు, కో ఆఫ్షన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేయర్ సామల బుచ్చిరెడ్డి, కమిషనర్ వేణుగోపాల్రెడ్డి కౌన్సిల్ సభ్యులను కోరారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో ప్రజాపాలన ఆరు గ్యారంటీల విధివిధానాలతో పాటు పలు అంశాలను చర్చించారు.
ప్రజాపాలనను పకడ్బందీగా నిర్వహిస్తామని మేయర్ మేకల కావ్య అన్నారు. బుధవారం డ్వాక్రా భవన్లో ప్రజాపాలనపై మేయర్ కావ్య అధ్యక్షతన అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ రామలింగం, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, కార్పొరేటర్లు, కోఆప్షన్సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్, అంగన్వాడీ, డ్వాక్రా, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.