హైదరాబాద్ : రాష్ట్రంలో తొలి డోసు వంద శాతం పూర్తయిన సందర్భంగా చింతల్బస్తీ అర్బన్ పీహెచ్సీని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ బుధవారం ఉదయం సందర్శించారు. పీహెచ్సీలో వ్యాక్సినేషన్ ప్రక్రియను గవర్నర్ పరిశీలించారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. మొదటి డోసు వంద శాతం పూర్తి కావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. సరైన సమయంలో రెండో డోసు తీసుకోవాలి. కేవలం ఒక డోసు తీసుకోవడం వల్ల ఉపయోగం లేదు. ఆశా వర్కర్లు ఇంటింటికీ వెళ్లి టీకాలు అందిస్తున్నారని తెలిపారు. నూతన సంవత్సర వేడుకల్లో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని గవర్నర్ సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.