మహేశ్వరం, నవంబర్ 26 : రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్మిస్తున్న మినీ రైతుబజార్ను జడ్పీ చైర్పర్సన్ తీగల అనితాహరినాథ్రెడ్డితో కలిసి మంత్రి పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతు సంక్షేమ కోసం రైతువేదికలను ఏర్పాటుచేసి రైతులను రాజులను చేసే విధంగా ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా తెలంగాణ రైతులకు రైతుబంధు, రైతుబీమా పథకాలను తీసుకొచ్చి రైతులకు మనోధైర్యం కలిపిస్తున్నామని ఆమె అన్నారు. చిరు వ్యాపారస్తులు రోడ్లమీద వ్యాపారం చేసుకోకుండా ఉండేందుకు వారికి షాపులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మినీ రైతుబజార్ నిర్మాణ పనులల్లో వేగం పెంచాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి నాయకులు కూన యాదయ్య, మండల పార్టీ అధ్యక్షులు అంగోతు రాజునాయక్, కో – ఆప్షన్ సభ్యులు సయ్యద్ ఆధిల్ అలీ, నాయకులు కరోళ్ల చంద్రయ్యముదిరాజ్, హనుమగల్ల చంద్రయ్య, సాలీవీరానాయక్, ఎంఏ సమీర్, డైరెక్టర్లు పొల్కం బాలయ్య, కడమోని ప్రభాకర్, సీఐ మధుసూదన్ పాల్గొన్నారు.
రోడ్డు ఉన్న ప్రతీ గ్రామానికి బస్సుసౌకర్యం కల్పిస్తా
ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పేదలకు సేవలు చేయడమే తన ధ్యేయమని అన్నారు. శుక్రవారం మంత్రి చాంబర్లో అన్నోజిగూడ సర్పంచ్ కాకి ఇందిరమ్మదశరథ చార్మినార్ డిపో నుంచి తిమ్మాయిపల్లి ఇబ్రహీంపట్నం డిపో నుంచి యాచారం మీదుగా అన్నోజిగూడ గ్రామాలకు నడిచే బస్సులను రద్దు చేశారని తెలిపారు. ప్రజలు, వ్యాపారస్తులు, విద్యార్థులు అవస్థలు పడుతున్నారని బస్సు సౌకర్యం కల్పించాలని వినతిపత్రం అందజేశారు. రిజినల్ మేనేజరు వెంటన్నకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి రోడ్డు ఉన్న ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సులను నడిపించాలని సూచించారు. గ్రామంలోని సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని వారికి తెలిపారు.
సీఎం సహాయనిధి పేదలకు వరం
పేదలకు సేవ చేయడమే తన లక్ష్యమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.రాచులూరు గ్రామానికి చెందిన భాగ్యమ్మకు రూ.36 వేలు, ముచ్చర్లకు చెందిన ఇస్తారికి రూ. 42, 500 , నేదునూరు గ్రామానికి భాస్కర్గౌడ్కు రూ.31వేలు, కందుకూరు గ్రామానికి చెందిన సురుసాని సురేందర్రెడ్డికి రూ.50వేలు, సరస్వతిగూడ గ్రామానికి చెందిన రవీందర్కు రూ. 60 వేలు, లేమూరు గ్రామానికి జగన్కు రూ.20వేలు, దన్నారం గ్రామానికి చెందిన పాండుకు రూ.60 వేలు, చిప్పలపల్లి గ్రామానికి చెందిన సత్యమ్మకు రూ. 30వేలు, అంజయ్యకు రూ. 27, 500, నేదునూరు గ్రామానికి చెందిన సునితకు రూ.70వేలు, రాములమ్మకు రూ.37, 500 , మొత్తం రూ.4, 64, 500 సీఎం రీలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి చేతుల మీదుగా బాధితులకు అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, అన్నోజిగూడ సర్పంచ్ కాకి ఇందిరమ్మ దశరథ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ గోపిరెడ్డి విజేందర్రెడ్డి, సర్పంచ్ రాము, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సురుసాని సురేందర్రెడ్డి, కాకి దశరథ, డాక్టర్ జంగయ్య, ఆనేగౌని పాండుగౌడ్, ఢిల్లీ కృష్ణయ్య, యాదయ్య, మల్లేశ్, డైరెక్టరు పాండు, నర్సింహ పాల్గొన్నారు.
బడంగ్పేట, నవంబర్ 26 : సీఎం సహాయనిధి పేదలకు వరమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 9వ డివిజన్ నందిహిల్స్లో నివాసముంటున్న మట్ట మల్లమ్మ అనారోగ్యానికి గురైంది. ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స తీసుకోగా అధిక ఖర్చు కావడంతో డివిజన్ ఇన్చార్జి రామిడి నర్సిరెడ్డి సహకారంతో సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. వచ్చిన రూ.45వేల చెక్కును మంత్రి శుక్రవారం బాధిత కుటుంబసభ్యునికి అందజేశారు.