బంజారాహిల్స్ : క్యాన్సర్ వ్యాధిపై సరైన అవగాహన లేకపోవడంతోనే అధిక మరణాలు సంభవిస్తున్నాయని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అన్నారు. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్, ఎన్ఎండీసీ సంయుక్తంగా నిర్వహించనున్న గ్రేస్ క్యాన్సర్ రన్ 2021 జెర్సీ, మెడల్స్ను జూబ్లీహిల్స్లోని దస్పల్లా హోటల్లో ఆమె గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా ఈ రన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకు గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ చేస్తున్న కృషిని ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపక ట్రస్టీ ప్రమీల సుంకవల్లి, సీఈవో డాక్టర్ చిన్నబాబు, విశ్రాంత ఐఏఎస్ అధికారి అజయ్ మిశ్రా, మాజీ ఐజీ సుధాకర్రావు, రేస్ డైరెక్టర్ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.