సిటీబ్యూరో, ఆగస్టు 25(నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ కవిత ఇంటి దగ్గర ఇటీవల జరిగిన ఘటన నేపథ్యంలో తెలంగాణ గౌడ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ గౌడ సంఘం నా యకులు ఆమె నివాసంలో మర్యాద పూర్వకంగా గురువారం కలిసి సంఘీభావం తెలిపారు.
వివరాలను ఎమ్మె ల్సీ కవితను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ రావు గౌడ్ మాట్లాడుతూ, కవిత ఇంటిపై దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు. మంత్రులు మహమూద్ అలీ, ప్రశాంత్ రెడ్డి సమక్షంలో సంఘీభావం తెలిపిన వారిలో జాగృతి నాయకులు కుమార్ స్వామి గౌడ్, తెలంగాణ గౌడ సంఘం ఉపాధ్యక్షుడు రాజయ్య గౌడ్, సంజయ్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు కుంట్లూర్ వెంకటేశ్ గౌడ్, గొట్టిపర్తి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు.