సిటీబ్యూరో, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ)/ చార్మినార్: సమకాలీన సామాజిక పరిస్థితుల్లో మగ్దూమ్ మొహియుద్దీన్ సాహిత్య స్ఫూర్తిని విస్తృతంగా ప్రచారం చేయాలని సుప్రసిద్ధ కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. సిటీ కాలేజీ పూర్వ అధ్యాపకుడైన మగ్దూమ్ పేర నెలకొల్పిన జాతీయ పురసారాన్ని 2022కు గాను ప్రజాకవి జయరాజ్కు, 2023కు గాను ప్రముఖ సంపాదకుడు కె.శ్రీనివాస్కు ప్రదానం చేసి వారిని ఘనంగా సన్మానించారు.
ముఖ్యఅతిథిగా హాజరైన గోరటి వెంకన్న మాట్లాడుతూ.. మగ్దూమ్ తాత్విక చైతన్యాన్ని తమ రచనల ద్వారా చాటి చెబుతున్న కె.శ్రీనివాస్, జయరాజ్లకు పురసారం ఇవ్వడం సముచితమైన నిర్ణయమన్నారు. నిజాయితీ నిబద్ధతతో ప్రజాస్వామ్య భావజాలానికి ప్రాణం పోస్తున్న ఏకైక సంపాదకుడు శ్రీనివాస్ అని, ప్రకృతి తత్వాన్ని, అంబేదర్ ఆలోచనావిధానాన్ని జయరాజ్ తన పాటల్లో కవిత్వీకరించాడని కొనియాడారు. అనంతరం మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ… కవిగా, నాటక కర్తగా, అధ్యాపకుడిగా, అనువాదకుడిగా, కార్మికోద్యమ నాయకుడిగా ఆనాటి తెలంగాణ సమాజంపై మగ్దూమ్ చూపిన ప్రభావం నేటికీ ఉన్నదన్నారు.
సభకు అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ పి.బాలభాసర్, ప్రముఖ కవి యాకూబ్ ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని అవార్డు కమిటీ కన్వీనర్ డాక్టర్ విప్లవ్ దత్శుక్లా, సభ్యులు యాదయ్య, రత్న ప్రభాకర్, కోయి కోటేశ్వరరావు సమన్వయం చేశారు. సిటీ కళాశాల పూర్వ ప్రిన్సిపాల్ వెల్చాల కొండలరావు, మగ్దూమ్ కుమారుడు జాఫర్ మొహియుద్దీన్, కొండపల్లి పవన్, పాశం యాదగిరి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.