సిటీబ్యూరో, సెప్టెంబర్ 7(నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో గోల్ఫ్ సందడి షురూ కానుంది. 5 వారాల పాటు గోల్ఫ్ క్రీడా అభిమానులను ఉత్సాహపర్చనుంది. హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్, శ్రీనిధి యూనివర్సిటీ తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ ఆధ్వర్యంలో ఈనెల 12న గోల్ఫ్ లీగ్ ప్రారంభం కానుంది. అందులో భాగంగా మంగళవారం కాకతీయ ద్వారం రూపంలో ఉన్న ట్రోఫీని తెలంగాణ యూత్ అడ్వాన్స్మెంట్ టూరిజం అండ్ కల్చర్ డిపార్ట్మెంట్ కార్యదర్శి కె.ఎస్. శ్రీనివాస రాజు ఆవిషరించారు. తెలంగాణ సంసృతి, వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఈ ట్రోఫీని కాకతీయ ముఖ ద్వారం రూపంలో అద్భుతంగా రూపొందించారని ఆయన అభినందించారు. హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దయాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ లీగ్ ఐదు వారాల పాటు వివిధ ఫార్మాట్లలో 8 రౌండ్లలో జరుగుతుందని, ఇందులో 12 మంది ఆటగాళ్లు కలిగిన 16 టీమ్లు పాల్గొంటాయన్నారు. అక్టోబర్ 9న ఫైనల్స్ ఉంటాయన్నారు. బహుమతుల ప్రదానంతో లీగ్ ముగుస్తుందని నిర్వాహకులు తెలిపారు.