బన్సీలాల్పేట్, ఆగస్ట్ 4 : భోలక్పూర్లోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ఆవరణలో శ్రీ కాళీకా మాత అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్ఠ వేద పండితులు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధి సొసైటీ చైర్మన్ తలసాని చిన్న శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ అందరి సహకారంతో రెండు నెలల పది రోజుల్లో ఆలయ నిర్మాణం పూర్తి చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు శివకుమార్, రాజేంద్రప్రసాద్, నాగేశ్వరరావు, వినోద్సింగ్, మల్లికార్జున్రావు, వినయ్కుమార్, రాజశేఖర్, శ్రీకాంత్, మారుతి, రవినందన్, రాంబాబు, నాగరాజు, సంతోశ్, రాకేశ్, అశోక్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి కృషి..
అమీర్పేట్, ఆగస్టు 4 : ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. గురువారం ఉదయం అమీర్పేట్ మాజీ కార్పొరేటర్ శేషుకుమారి ఆధ్వర్యంలో డివిజన్లోని ప్రశాంత్నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మారేడ్పల్లిలోని నివాసంలో కలిసి కాలనీ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ కాలనీ వాసులు కోరుతున్న విధంగా రోడ్డు నిర్మాణ పనులు, ఫుత్పాత్ అభివృద్ధి పనులను వెంటనే చేపట్టేలా చూస్తామని హామీ ఇచ్చారు. కాలనీలో పారిశుధ్య పనులు సమర్థవంతంగా జరిగేలా చూస్తామన్నారు. కాలనీ నివాసితులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను జోనల్ కమిషనర్ రవికిరణ్కు ఫోన్లో వివరించిన మంత్రి తలసాని త్వరగా పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంత్రిని కలిసిన వారిలో కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు శివరాజ్, సభ్యులు ప్రకాశ్ అగర్వాల్, రాజగోపాల్ మందన్న, రాధ, రవీంద్ర రాజన్, రామకృష్ణ, టీఆర్ఎస్ నాయకులు కూతురు నర్సింహ తదితరులు పాల్గొన్నారు.