మెహిదీపట్నం : సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు మెహిదీపట్నం, నాంపల్లి నియోజకవర్గాల పరిధిలో ఘనంగా నిర్వహించారు. వేడుకలలో భాగంగా పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్, నాంపల్లి నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి సీహెచ్.ఆనంద్కుమార్గౌడ్లు నాంపల్లి యూసుఫియన్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన యోధుడు కేసీఆర్ అని కొనియాడారు. నాంపల్లి నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి సీహెచ్.ఆనంద్కుమార్గౌడ్ ఆధ్వర్యంలో మెహిదీపట్నంలో కేక్ కట్ చేశారు,
లంగర్హౌస్ లక్ష్మీనగర్ చౌరస్తా సమీపంలో రాష్ట్ర నాయకులు కె.శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.
పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బండి రమేష్,నాయకులు సంజయ్, మల్లేపల్లిలో పేదలకు బ్రెడ్ పంచి పెట్టారు. లంగర్హౌస్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలలో భాగంగా టీఆర్ఎస్ కార్వాన్ నియోజకవర్గం ఇన్ఛార్జి ఠాకూర్ జీవన్సింగ్, మహిళా అధ్యక్షురాలు నంతోట పల్లవిలు కేక్ కట్చేశారు.