హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలోని శేరిలింగంపల్లి టౌన్ ప్లానింగ్ ఈఈ మెతుకు నరసింహరాములు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో సోదాలు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. ముసారాంబాగ్ శాలివాహన నగర్లోని నరసింహరాములు ఇంటితో పాటు, బంధువుల నివాసాల్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి.