సిటీబ్యూరో, జనవరి 22 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ ఆదేశాల మేరకు నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంలో సోమవారం బేగంపేటలోని శ్రీశక్తి కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో ఫుడ్ హ్యాండ్లర్లకు శిక్షణను ఏర్పాటు చేశారు.
నాణ్యమైన ఆహారం, ఫుడ్ హ్యాండ్లర్లకు పరిశుభ్రత, ఆహార చట్టాలు, కల్తీ నియంత్రణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు.