సిటీబ్యూరో, జూలై 26 (నమస్తే తెలంగాణ ): భోపాల్కు చెందిన మున్సిపల్ కమిషనర్ల బృందం సోమవారం జీహెచ్ఎంసీని సందర్శించారు. గ్రేటర్ హైదరాబాద్లో ఆస్తిపన్ను సేకరణ, ఇతర ఆర్థిక వనరుల సేకరణపై అధ్యయనం చేసింది. 12 మంది అధికారుల బృందానికి జీహెచ్ఎంసీ రెవెన్యూ అంశాలకు సంబంధించి అడిషనల్ కమిషనర్ ప్రియాంక అలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా భోపాల్ బృందానికి వివరించారు. అనంతరం ఖైరతాబాద్ సర్కిల్ కార్యాలయానికి వెళ్లి పన్నుల వసూళ్లు, సిటిజన్ సర్వీస్ సెంటర్ పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించారు.