బన్సీలాల్పేట్, ఫిబ్రవరి 8 : కండ్లెదుటే గుండెపోటుకి గురయిన వ్యక్తిని రక్షించేందుకు సికింద్రాబాద్లోని గాంధీ మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థులు సీపీఆర్పై శిక్షణ ఏర్పాటు చేశారు.
కళాశాల అలుమ్ని భవనంలో శుక్ర, శనివారాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉచితంగా సీపీఆర్పై శిక్షణ, అవగాహన ఇవ్వనున్నామని గాంధీ అలుమ్ని సంఘం అధ్యక్షుడు డాక్టర్ జీఆర్ లింగమూర్తి, కార్యదర్శి డాక్టర్ ఏవీ.రత్నం తెలిపారు.