చిక్కడపల్లి, జూలై 4 : హుస్సేన్సాగర్ నాలా రిటర్నింగ్ వాల్ పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కోరారు. రాంనగర్ డివిజన్ బాగ్లింగంపల్లి శ్రీరాంనగర్ బస్తీలో స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్, అధికారులతో కలిసి మేయర్ ఆదివారం పర్యటించారు. శ్రీరాంనగర్ బస్తీ సమస్యలను బస్తీ అధ్యక్షుడు ఆర్.వివేక్ మేయర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శ్రీరాంనగర్ బస్తీ ప్రధానరోడ్డులో పెండింగ్లో ఉన్న ఫుట్పాత్ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో రాంనగర్ డివిజన్ కార్పొరేటర్ రవి చారి, యువ నాయకుడు ముఠా జైసింహ, టీఆర్ఎస్ డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్.వివేక్, తెలంగాణ హౌస్ఫెడ్ డైరెక్టర్ కిషన్రావు, దామోదర్రెడ్డి, జయదేవ్, ప్రభాకర్, నాగభూషణం, శ్రీధర్రెడ్డి, రాకేశ్ పాల్గొన్నారు.
బోనాల ఉత్సవాలను కొవిడ్ నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. అమ్మవారి దేవాలయాల నిర్వాహకులు బోనాల జాతర ఏర్పాట్ల కోసం నిధులకు దరఖాస్తులు చేసుకోవాలని ఆయన సూచించారు. గాంధీనగర్ డివిజన్ జవహర్నగర్లో శ్రీనల్లపోచమ్మ, ఉప్పలమ్మ దేవతల విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఠాగోపాల్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్కుమార్ యాదవ్, స్థానిక కార్పొరేటర్ పావనీవినయ్కుమార్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎంఎన్ శ్రీనివాస్ రావు, యువ నాయకుడు ముఠా జైసింహ, మాజీ కార్పొరేటర్ ముఠా పద్మానరేశ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఉప్పలమ్మ విగ్రహ దాతలు శీలం సత్యనారాయణ, శీలం ప్రేమలత, శ్రీ నల్లపోచమ్మ విగ్రహ దాత సాయికీర్త్, ఆలయ పునర్నిర్మాణ కమిటీ సభ్యులు నర్సింగ్ రావు, ప్రభాకర్, యాదగిరి, రాము, బాలరాజు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.