కందుకూరు, జనవరి 2 : ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఆదివారం మంత్రి నివాసంలో కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి. పీఏసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్, మహిళా అధ్యక్షురాలు తాండ్ర ఇందిరమ్మ దేవేందర్, సీనియర్ నాయకులు కాకి దశరథ ముదిరాజ్, చిర్ర సాయిలు, రాయిచెట్టు యాదయ్య. ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్రెడ్డి, కృష్ణరాంభూపాల్రెడ్డి, అనుబంధ సంఘాల అధ్యక్షులు సోలిపేట అమరేందర్రెడ్డి, పాండుగౌడ్, విజ్ఞేశ్వర్రెడ్డి, వెంకటేశ్, సామయ్య, జయమ్మ రాజు, రామకృష్ణ, యాదయ్య, డైరెక్టర్ సామ ప్రకాశ్రెడ్డి, పాండురంగారెడ్డి, ఆనంద్, అంజాద్, అలీ, అశోక్ ముదిరాజ్, నర్సింహ, ఉదయ్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
తండాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
తండాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం గంగారం తండా గిరిజన మహిళలు మంత్రిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అంగోతు రాజునాయక్, ఎస్టీ సెల్ మహిళా అధ్యక్షురాలు శాంతి పాండునాయక్, గిరిజన మహిళలు, ఎస్టీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
మహేశ్వరంలో..
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డికి మహేశ్వరం మండల ప్రజలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సహకారబ్యాంక్ చైర్మన్ మంచె పాండుయాదవ్, వైస్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, పార్టీ అధ్యక్షుడు అంగోతు రాజునాయక్, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు థామస్రెడ్డి, సర్పంచ్లు చంద్రశేఖర్రెడ్డి, మెగావత్రాజునాయక్, మోతీలాల్నాయక్, నాయకులు కంది అరుణ రమేశ్, వీరానాయక్, గుత్తిపాండు, బండారి లింగం, పరిగి సుధాకర్రెడ్డి తొంట రవీందర్, ఏకుల రాములు, బాలకిషన్, సీతారాంనాయక్ డైరెక్టర్లు కడమోని ప్రభాకర్, పొల్కంబాలయ్య, మాజీ సర్పంచ్ మల్లేశ్యాదవ్, ఉపసర్పంచ్ బురమోని నర్సింహ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.